| మకుటం
                     | 
                    ఈశ్వరీయ వరద మహాలింగ
                     | 
                
            
        
        
            
            మగువ - మన్ను - కనకాలను విడిపించని గురూపదేశాన్ని నేనొల్లను
            రోషాన్ని, హర్షాన్ని, చెరపని లింగాన్ని పూజించను
            తామస భ్రమను మాపని జంగమానికి దాసోహం చేయను
            పరమానందం కాని పాదోదకాన్ని తీసుకోను
            పరిణామంలేని ప్రసాదాన్ని తినను
            నేననేదాన్ని చెపని ఈశ్వరీయ
            వరద మహాలింగాన్ని ఏమని అనను. / 1421 
            [1]
            
            అప్పిదేవయ్య: కాలం క్రి.శ. 1650. ఈశ్వరీయ వరద
            మహాలింగ మీతని అంకితముద్ర. ఒక్క వచనమే లభించింది. నేను అన్నది తుడిచిపెట్టని గురులింగ
            జంగమాల ప్రసాదాన్ని వద్దని నిరాకరించే స్తైర్యం ఇందులో అందంగా తెలుపబడింది.
        
     
    Reference:
    
        గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం:డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద
        సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర
        సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్బిఎన్:978-93-81457-05-4. 2012.
    
    
        [1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu",
        ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation:
        G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.
    
    
    *