| మకుటం | 
                    ని:కళంక మల్లికార్జునా  | 
                
                
                    | కాయకం:
                     | 
                    కాశ్మీరదేశపు ప్రభువు, కట్టెలకొట్టి తెచ్చి అమ్మి జీవించే కాయకం. | 
                
            
        
        
            రాతిలో మట్టిలో చెట్టులో దేవుళ్ళున్నారని
            ఎక్కెడెక్కడో యాతన పడే అన్నలారా వినండహో
            అవన్ని అక్కక్కడ వుంచిన ఘనతకు గురుతేకాని
            ఆతడు మాటల కతీతుడయ్యా
            మనసెక్కడ వుంటుందో అక్కడే ఆతని వునికి
            ని:కళంఖ మల్లికార్జునా/1981 
            [1]
            
            మోళిగె (కర్రల) మారయ్య: ఈయన కాశ్మీరదేశపు ప్రభువు. అసలు పేరు మహాదేవ భూపాలుడు. భార్య పేరు గంగాదేవి. బసవన్న గొప్పతనాన్ని విని మెచ్చి రాజ్యాన్ని త్యజించి ఇద్దరూ కల్యాణానికి వచ్చారు. మహాదేవి-మారయ్యలను పేర్లు ధరించి కట్టెలకొట్టి తెచ్చి అమ్మి జీవించే కాయకం. ఎన్నుకొని శరణధర్మాశ్రయ జీవనులైవుంటారు. వీరి కాయక నిష్ఠ, ధృఢదీక్ష, శూన్య సంపాదనలో ఒక కథకు మూలధాతువులైనాయి. కాలం క్రీ.శ. 1160. "ని:కళంక మల్లికార్జునా" అనే మకుటంతో ఈయన రచించిన 808 వచనాలు సంకలితమైనాయి. వైవిధ్యమయంగా తాత్విక, ధార్మిక, ఆధ్యాత్మిక, సామాజిక, అనుభావిక వస్తువిషయాలను గురించిన ఈ వచనాలు మారయ్యగారి విద్వత్తు, ఆధ్యాత్మిక నిలువు. అనుభావపు ఔన్నత్యం, సామాజిక సంవేదన, సాహిత్యక శ్రీమంతతనం ప్రస్ఫుటంగా ప్రదర్శిసుతన్నాయి.
            
        
     
    Reference:
    
        గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద
        సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర
        సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్బిఎన్:978-93-81457-05-4. 2012.
    
    
        [1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu",
        ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation:
        G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.
    
    
    *